ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఇండి కూటమి పార్టీలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా విమర్శించారు. ఈ కూటమి ప్రధానిని కాదు, దేశాన్నే ఓడించిందని వ్యాఖ్యానించారు.మహిళల ఆశయాలను, వారి హక్కులను దెబ్బతీశారని ఆరోపించిన ఆయన, మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం ద్వారా ఏమి సాధించారో డీఎంకే సహా కూటమి పార్టీలు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.మహిళల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచే ఈ కీలక బిల్లును అడ్డుకోవడం సరైనది కాదని పేర్కొన్న చంద్రబాబు, ఈ అంశంపై దేశంలోని మహిళలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇండి కూటమి పార్టీలపై ఉందన్నారు.
