Breaking News

బీజేపీ, జనసేన నేతల వ్యాఖ్యలపై చర్యలు తీసుకోండి: చంద్రబాబుకు పొన్నం లేఖ

హైదరాబాద్, ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు. రాష్ట్ర విభజనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న కూటమిలోని బీజేపీ, జనసేన నేతలను కట్టడి చేయాలని ఆయన కోరారు.బీజేపీ ఎంపీ తేజస్వీ ఆంధ్రప్రదేశ్ విభజనను భారత్-పాక్ విభజనతో పోల్చిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.అలాగే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తెలంగాణ అడ్డుపడుతోందని జనసేన నేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన ఆక్షేపించారు. ఈ వ్యాఖ్యలు ప్రజల్లో అపోహలు సృష్టించేలా ఉన్నాయని అన్నారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గతంలో చేసిన వ్యాఖ్యల వల్లే ఇటువంటి వ్యాఖ్యలు వస్తున్నాయని పొన్నం ప్రభాకర్ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రాల మధ్య సౌహార్దాన్ని కాపాడేలా నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.

కొత్తగూడెంలో రాష్ట్ర రైతు సంఘం మూడవ మహాసభలు ప్రారంభం.

ఆర్టీసీ కార్మికుల ధర్నాకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మద్దతు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *