Breaking News

జగిత్యాల సభలో కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు.. చంద్రబాబుపై విమర్శలు

జగిత్యాల, ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): జగిత్యాలలో జరిగిన సభలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తన ప్రసంగంలో తెలంగాణ ఉద్యమం రోజుల్ని గుర్తుచేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారుఅప్పటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రాంతానికి తాగునీరు, విద్యుత్ సరఫరా సరైన విధంగా లేవని ఆయన అన్నారు. అలాంటి సమయంలో విద్యుత్ చార్జీలను భారీగా పెంచడం ప్రజలపై భారంగా మారిందని విమర్శించారు. చార్జీల పెంపును వెనక్కి తీసుకోవాలని తాను లేఖ రాసినా స్పందన రాలేదని పేర్కొన్నారు.రైతులు ఆందోళనకు దిగినప్పుడు బషీర్‌బాగ్‌లో జరిగిన కాల్పుల ఘటనను ఆయన ప్రస్తావించారు. ఆ ఘటనలో ముగ్గురు మరణించారని, ఆ సంఘటన తర్వాతే తెలంగాణ కోసం పోరాటాన్ని మరింత తీవ్రతరం చేయాలని నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఆ సమయంలో ఎదురైన కష్టాలను గుర్తుచేసుకుంటూ, ఉద్యమం వెనుక ఉన్న భావోద్వేగాలను కేసీఆర్ వివరించారు.

కొత్తగూడెంలో రాష్ట్ర రైతు సంఘం మూడవ మహాసభలు ప్రారంభం.

ఆర్టీసీ కార్మికుల ధర్నాకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మద్దతు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *