అమరావతి, ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): స్థిరాస్తి వ్యాపారి పెద్దదస్తగిరి హత్య కేసుపై మంత్రి పార్థసారథి తీవ్ర ఆరోపణలు చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన, వైకాపా నేతలు ప్రజల దృష్టి మళ్లించేందుకు నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు.“హత్యలు చేయిస్తారు.. పరామర్శ కూడా వాళ్లే చేస్తారు” అంటూ మంత్రి వ్యాఖ్యానించారు. గతంలో వివేకా హత్య ఘటనలో కూడా ఇదే తరహా పరిస్థితులు కనిపించాయని ఆయన అన్నారు.పెద్దదస్తగిరి హత్యకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి, ఈ కేసులో కొన్ని ప్రముఖుల పాత్రపై అనుమానాలు వ్యక్తం చేశారు. దస్తగిరి కొందరు రాజకీయ నేతలకు అత్యంత సన్నిహితుడని పేర్కొన్నారు.హత్య అనంతరం కొద్ది గంటల్లోనే నిందితులు ఆశ్రయం పొందినట్లు ఆధారాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి నిజాలను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి దస్తగిరి హత్య కేసు చర్చనీయాంశంగా మారింది.
