ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): టీ20 వరల్డ్కప్ 2026 నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్లో సంచలన పరిణామాలు వెలుగులోకి వచ్చాయి. కెనడా జట్టుతో సంబంధం ఉన్న ఒక వివాదంలో గ్యాంగ్స్టర్ ముఠా ప్రమేయం ఉందన్న ఆరోపణలు క్రీడా ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి.విదేశీ మీడియా కథనాల ప్రకారం, 2025 జూలైలో కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో జరిగిన ఒక ఘటన ఈ వివాదానికి కారణమైంది. ఒక రెస్టారెంట్లో భోజనం చేస్తున్న కెనడా జట్టు ఆటగాడిని కలిసిన ఇద్దరు వ్యక్తులు తమను గ్యాంగ్ ప్రతినిధులుగా పరిచయం చేసుకుని, ఒక ఆటగాడిని జట్టులోకి తీసుకుని కెప్టెన్గా చేయాలని ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. సహకరించకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించినట్లు తెలుస్తోంది.ఇదే సమయంలో కెనడా కెప్టెన్ దిల్ప్రీత్ బజ్వా ప్రదర్శనపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో అతను బౌలింగ్ చేసిన ఒక ఓవర్ అనుమానాస్పదంగా ఉండటంతో స్పాట్ ఫిక్సింగ్ అనుమానాలు తలెత్తాయి. దీంతో ఐసీసీ యాంటీ కరప్షన్ విభాగం విచారణ ప్రారంభించింది.దర్యాప్తులో భాగంగా బజ్వా ఫోన్ను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నట్లు సమాచారం. గ్యాంగ్తో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. జైలులో నుంచే కార్యకలాపాలు కొనసాగిస్తున్న ముఠా క్రికెట్ బెట్టింగ్ రంగంలోకి కూడా ప్రవేశించిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇక ఈ వ్యవహారంలో క్రికెట్ బోర్డు సభ్యుల ప్రమేయం ఉన్నదన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే సంబంధిత వ్యక్తులు ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు.ఈ పరిణామాలు కెనడాలో ఆటగాళ్ల భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయి. పూర్తి స్థాయి విచారణ అనంతరం అసలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ వ్యవహారం క్రికెట్ ప్రతిష్ఠను దెబ్బతీసేలా మారింది.
