Breaking News

ఉపాధి హామీ పథకం అమలుపై జగన్ విమర్శలు

అమరావతి, ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం అమలు విషయంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విమర్శించారు. గ్రామీణ ప్రజల సమస్యలను పట్టించుకునే పరిస్థితి ప్రస్తుతం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ (MGNREGA) పథకం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకమని పేర్కొన్న జగన్, ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరిగి ప్రజలకు ఆదాయం కలుగుతుందని చెప్పారు. పల్లెల్లో జీవనోపాధి మెరుగుపడేందుకు ఈ పథకం ముఖ్య పాత్ర పోషిస్తుందని వివరించారుఅయితే, ప్రస్తుత ప్రభుత్వం ఈ పథకాన్ని సమర్థంగా అమలు చేయడంలో వెనుకబడిపోయిందని ఆయన ఆరోపించారు. ఉపాధి హామీ పనులు సక్రమంగా నిర్వహించకపోవడంతో గ్రామీణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గ్రామీణ అభివృద్ధికి ఈ పథకం కీలకమైనదని, దాన్ని సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని జగన్ సూచించారు.

దక్షిణాదికి అన్యాయం చేయను: చంద్రబాబు

ప్రభుత్వంఅంగన్వాడీల ద్వారా అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలి,: సూపర్వైజర్ టి.అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *