హైదరాబాద్, ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక):: తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెకు తెలంగాణ జాగృతి సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె న్యాయమైనదని పేర్కొన్నారు. వారి డిమాండ్లు వెంటనే నెరవేర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి, త్వరితగతిన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. కార్మికుల సంక్షేమం కోసం తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని స్పష్టం చేశారు.
