Breaking News

సివిల్ సర్వీసెస్ దినోత్సవం.. అధికారులకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

అమరావతి, ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): జాతీయ సివిల్ సర్వీసెస్ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశంలోని సివిల్ సర్వెంట్లకు శుభాకాంక్షలు తెలిపారు. పరిపాలనను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించడంలో అధికారుల పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు.సోషల్ మీడియా ద్వారా స్పందించిన సీఎం, సివిల్ సర్వీసెస్‌లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు తమ బాధ్యతలను గుర్తుంచుకుని ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని సూచించారు. ప్రజా సేవలో నిబద్ధత, పారదర్శకత, సమర్థత ఎంతో అవసరమని తెలిపారు.అభివృద్ధి ఫలాలు ప్రజలకు క్షేత్రస్థాయిలో చేరినప్పుడే పాలనకు అసలు అర్థం ఉంటుందని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ పథకాలు నిజంగా ప్రజలకు ఉపయోగపడేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. ప్రజల సమస్యలను త్వరగా గుర్తించి పరిష్కరించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచవచ్చని పేర్కొన్నారు. సాంకేతికతను వినియోగిస్తూ సేవలను మరింత మెరుగుపరచాలని, ప్రజలతో సన్నిహితంగా ఉండాలని అధికారులకు సూచించారు.సమాజ అభివృద్ధిలో సివిల్ సర్వెంట్లు కీలక పాత్ర పోషిస్తున్నారని, సేవాభావంతో పనిచేయాలని సీఎం పిలుపునిచ్చారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *