ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడులోని సాతూర్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్డీఏ పాలనతోనే తమిళనాడు అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు.2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో విధ్వంసం జరిగిందని విమర్శించిన ఆయన, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం సహకారంతో రాష్ట్ర పునర్నిర్మాణం జరుగుతోందన్నారు. గత ఐదేళ్లుగా చెన్నై అభివృద్ధి శూన్యంగా మారిందని ఆరోపించారు.ఎన్డీఏ అభ్యర్థులను గెలిపిస్తే తమిళ ప్రజలే గెలిచినట్లవుతుందని చంద్రబాబు తెలిపారు. అభివృద్ధి కోసం ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు.
