ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): ఉమెన్ రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులపై కాంగ్రెస్, డీఎంకే పార్టీలు గుడ్డిగా వ్యతిరేకిస్తున్న తీరు దక్షిణాది రాష్ట్రాలకు నష్టమని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈ అంశాలపై తాను మాట్లాడుతున్నందుకు తనపై దక్షిణాది వ్యతిరేకిగా ముద్ర వేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.దక్షిణాది రాష్ట్రాలకు తాను ఎప్పుడూ అన్యాయం చేయనని స్పష్టం చేసిన చంద్రబాబు, 2001లో అటల్ బిహారి వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే ఈ ప్రాంతానికి నష్టం జరుగుతుందని భావించి ఆ ప్రక్రియను ఆపించానని గుర్తు చేశారు.ఈ విషయాలను ‘ఇండీ’ కూటమి పార్టీలు గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. దక్షిణాది ప్రయోజనాల పరిరక్షణే తన లక్ష్యమని చంద్రబాబు పేర్కొన్నారు.
