ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): ప్రధాని నరేంద్ర మోదీపై తాను చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీయడంతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వివరణ ఇచ్చారు. తాను మోదీని టెర్రరిస్ట్ అని అనలేదని స్పష్టం చేశారు.తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని, మోదీ ప్రభుత్వం ప్రజలను మరియు ప్రతిపక్ష పార్టీలను భయపెడుతోందని చెప్పడమే తన ఉద్దేశమని ఖర్గే పేర్కొన్నారు. ఈడీ, ఐటీ, సీబీఐ సంస్థలను ఉపయోగించి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందిస్తూ విమర్శలు చేస్తున్నారు. దీంతో ఎన్నికల సమయంలో రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది.
