ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): కేసీఆర్ ఆదేశాల ప్రకారమే తాను ఢిల్లీకి వెళ్లినట్లు హరీశ్ రావు తెలిపారు. జగిత్యాల సభకు రాకపోవడంపై వివరణ ఇస్తూ, కాళేశ్వరం కేసు నేపథ్యంలో సుప్రీంకోర్టులో పిటిషన్ అంశంపై న్యాయవాదులను కలిసేందుకు వెళ్లానన్నారు.ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు, ఓటుకు నోటు కేసులపై కూడా చర్చలు జరిపినట్లు చెప్పారు. మరోవైపు కేసీఆర్ ప్రసంగాన్ని లక్షలాది మంది వీక్షించగా, సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగానికి తక్కువ స్పందన లభించిందని వ్యాఖ్యానించారు.
