ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్లో రీల్స్ కోసం చేసిన ప్రయత్నం విషాదానికి దారితీసింది. నాచారం పరిధిలోని మల్లాపూర్ గాంధీబొమ్మ బస్తీలో మిథున్(14) అనే బాలుడు బిల్డింగ్పై నుంచి జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు.ఈ నెల 5న జరిగిన ఈ ఘటన సీసీటీవీలో రికార్డైంది. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ, రెండు రోజుల క్రితం బాలుడు మృతి చెందాడు. ఈ ఘటనతో ప్రాంతంలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని స్వగ్రామం బిహార్కు తరలిస్తున్నారు.
