ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతగా, సినీ విశ్లేషకుడిగా గుర్తింపు పొందిన త్రిపురనేని చిట్టిబాబు కన్నుమూశారు. ఆయన వయస్సు 71 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో సినీ రంగంలో విషాద వాతావరణం నెలకొంది.చిట్టిబాబు నిర్మాతగా పలు చిత్రాలకు సేవలందించడంతో పాటు, సినీ విశ్లేషకుడిగా తన స్పష్టమైన అభిప్రాయాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సినీ రంగంలోని పరిణామాలపై నిర్మొహమాటంగా మాట్లాడే వ్యక్తిగా ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది.అనేక టెలివిజన్ చర్చల్లో పాల్గొని సినీ అంశాలపై విశ్లేషణలు అందిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పరిశ్రమలోని సమస్యలు, మార్పులపై ఆయన చేసిన వ్యాఖ్యలు తరచూ చర్చనీయాంశమయ్యాయి.చిట్టిబాబు మృతిపై సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన సేవలు సినీ పరిశ్రమలో చిరస్మరణీయంగా నిలిచిపోతాయని పేర్కొంటున్నారు.
