ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): రైతుల జీవితం, వారి కష్టాలు, విజయాలను ప్రతిబింబించే కథాంశంతో రూపొందుతున్న ‘ఫీచర్ ఫిల్మ్’ చిత్రం గుంటూరు సమీపంలోని వింజనంపాడు గ్రామంలో ప్రారంభమైంది. దర్శకుడు సుధాకరరెడ్డి టి. ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.గ్రామీణ జీవన విధానం, రైతుల సమస్యలు, ఆశలు, భావోద్వేగాలను సహజంగా చూపించడమే ఈ సినిమా లక్ష్యమని దర్శకుడు తెలిపారు. రైతు జీవితం కుటుంబం, సమాజం, ఆర్థిక వ్యవస్థతో ముడిపడి ఉన్నదని ఈ చిత్రం ద్వారా తెలియజేయనున్నట్లు చెప్పారు.ఈ సినిమా తొలి షెడ్యూల్ గుంటూరు పరిసర ప్రాంతాల్లో జరుగుతుండగా, తదుపరి షెడ్యూల్ విజయవాడ, అమరావతి ప్రాంతాల్లో నిర్వహించనున్నారు. సహజత్వాన్ని ప్రతిబింబించేలా చిత్రీకరణ కొనసాగుతోందని చిత్రబృందం వెల్లడించింది.తేజు ఫిలిమ్స్ బ్యానర్పై రూపొందుతున్న ఈ చిత్రానికి సంతోష్ రావు బాల్గురి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రైతుల సమస్యలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు.ఈ చిత్రానికి జగపతి శ్రీనివాస్ మాటలు అందిస్తుండగా, దాసరి రవికుమార్ కెమెరామెన్ మరియు ఎడిటర్గా పని చేస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి డి. సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.రైతు సమాజానికి వెన్నెముక అనే సందేశాన్ని ప్రేక్షకులకు చేరవేయాలని చిత్రబృందం భావిస్తోంది. రైతుల జీవితాలను హృదయానికి హత్తుకునేలా చూపించే ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
