ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): బెంగళూరులో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో ప్రియుడిని ఇంటికి పిలిపించి హత్య చేసిన యువతి ఘటన కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, టెలికం స్టోర్లో పనిచేస్తున్న ప్రేరణ, కిరణ్ అనే యువకుడితో ఏడాదిగా ప్రేమలో ఉన్నారు.ఇటీవల తనను నిర్లక్ష్యం చేస్తున్నాడనే అనుమానంతో ఆగ్రహానికి గురైన ప్రేరణ, కిరణ్ను ఇంటికి పిలిచింది. ‘ఫారిన్ స్టైల్ ప్రపోజల్’ అంటూ అతని కళ్లకు గంతలు కట్టి కుర్చీకి కట్టేసింది. అనంతరం అతనిపై పెట్రోల్ పోసి నిప్పంటించింది.ఈ దారుణాన్ని వీడియోగా చిత్రీకరించినట్లు సమాచారం. తీవ్ర గాయాల కారణంగా కిరణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
