Breaking News

TGSRTC జేఏసీ డిమాండ్లు ఇవే

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): టీజీఎస్‌ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ తమ కీలక డిమాండ్లను వెల్లడించింది. ప్రభుత్వ ఎన్నికల హామీలను పూర్తిగా అమలు చేయాలని, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని ప్రధానంగా కోరింది.పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించడంతో పాటు, 2017 నుంచి పెండింగ్‌లో ఉన్న అలవెన్సులను పెంచాలని డిమాండ్ చేసింది. అలాగే 2021 పే రివిజన్ ప్రకారం 30 శాతం ఫిట్‌మెంట్ అమలు చేయాలని సూచించింది.ఆర్టీసీ అభివృద్ధి కోసం కొత్త బస్సులు కొనుగోలు చేయడం, వర్క్‌షాపులను బలోపేతం చేయడం అవసరమని పేర్కొంది. సంస్థపై ఉన్న అప్పులను ప్రభుత్వం తీసుకుని, బడ్జెట్‌లో 3 శాతం నిధులు కేటాయించాలని కోరింది.కార్మికులకు 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని జేఏసీ స్పష్టం చేస్తూ, తమ డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరింది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *