ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): అత్యాధునిక పరిపాలనా విధానాల అధ్యయనం కోసం సింగపూర్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా అక్కడ అమలవుతున్న ‘మీట్ ది పీపుల్’ విధానాన్ని వారు పరిశీలించారు. ఈ విధానం ద్వారా ప్రతి వారం ప్రజల సమస్యలను స్వీకరించి, పరిష్కరించే విధానంపై అధికారులు వివరాలు తెలియజేశారు.మంత్రులు నారాయణ, జనార్దన్, అనిత, అచ్చెన్నాయుడు, సత్యకుమార్, అనగాని ఈ పర్యటనలో పాల్గొంటున్నారు. సింగపూర్ వాణిజ్య శాఖ మంత్రి హువాంగ్తో సమావేశమై స్కిల్ డెవలప్మెంట్ అంశంపై చర్చలు జరిపారు.అలాగే స్పోర్ట్స్ సదుపాయాలు, థియేటర్లు, లైబ్రరీలు, షాపింగ్ మాల్స్ను ఒకేచోట సమీకరించిన ‘ఆవర్ టాంపైన్స్ హబ్’ను కూడా మంత్రులు సందర్శించి అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. ఈ పర్యటన ద్వారా రాష్ట్రంలో మెరుగైన పరిపాలనా విధానాలను అమలు చేయాలని మంత్రులు భావిస్తున్నారు.
