ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావుకు హైకోర్టులో ఊరట లభించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. కమిషన్ నివేదిక తయారీలో విధివిధానాలు సరిగా పాటించలేదని కోర్టు అభిప్రాయపడింది. అయితే కమిషన్ ఏర్పాటు మాత్రం చట్టబద్ధమేనని పేర్కొంది.కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని పేర్కొంటూ 2025 జూలైలో పీసీ ఘోష్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే.
