Breaking News

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల నియామకం

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రవాణా సేవలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తాత్కాలికంగా డ్రైవర్లు, కండక్టర్ల నియామక ప్రక్రియను ప్రారంభించింది.దిల్‌సుఖ్‌నగర్ డిపోలో ఇప్పటికే 10 మంది కండక్టర్లను నియమించినట్లు డిపో మేనేజర్ కరుణ తెలిపారు. అవసరమైన అర్హతలు కలిగిన అభ్యర్థులు ముందుకు రావాలని అధికారులు సూచిస్తున్నారు.పదో తరగతి సర్టిఫికేట్, ఆధార్ కార్డు, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వారు సమీప ఆర్టీసీ డిపోలను సంప్రదించి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. సమ్మె ప్రభావాన్ని తగ్గించేందుకు ఈ తాత్కాలిక చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *