విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీదీక్ష విరమణ.. ప్రత్యేక యాప్
విజయవాడ, డిసెంబర్ 18, 2024:
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈనెల 21 నుంచి 25 వరకు జరగనున్న భవానీదీక్ష విరమణకు లక్షలాదిగా భవానీ మాలధారులు రానున్నారు. వీరంతా జగన్మాత సన్నిధిలో దీక్షలు విరమిస్తారని ఆలయ ఈవో రామారావు తెలిపారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ పరిధిలో సమగ్ర సమాచారం అందించే ఉద్దేశంతో, “భవానీదీక్ష 2024” పేరుతో ప్రత్యేక యాప్ను రూపొందించినట్లు ఈవో వెల్లడించారు. ఈ యాప్లో 24 రకాల సేవలు అందుబాటులో ఉంటాయని ఆయన చెప్పారు.
