ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయింది. సమ్మె ప్రభావంతో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటలకు ప్రభుత్వ విప్లు, ఎమ్మెల్యేలతో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జూమ్ సమావేశం నిర్వహించనున్నారు.ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితులను సమీక్షించడంతో పాటు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలకు సూచనలు ఇవ్వనున్నారు. ముఖ్యంగా తమ తమ నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేయడంలో చొరవ చూపాలని మంత్రి సూచించనున్నట్లు సమాచారం.ప్రజల రాకపోకలకు అంతరాయం కలగకుండా స్థానిక స్థాయిలో సమన్వయం పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.
