బెల్లంపల్లి (మంచిర్యాల), ఏప్రిల్ 22 (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో బుధవారం మంచిర్యాల ఆర్టీసీ డిపో వద్ద ప్రైవేట్ అద్దె బస్ డ్రైవర్ ను పోలీసులు కొట్టడంతో ప్రైవేట్ ఆర్టీసీ కార్మికులు (డ్రైవర్లు) ఆందోళనకు దిగారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉండడంతో అద్దె బస్సులు నడుపుతున్న ప్రైవేటు డ్రైవర్లతో బస్సులను నడిపేందుకు సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో అద్దె బస్సు యజమానితో తమ సమస్యను తెలిపేందుకు వెళ్తున్న ఒక ప్రైవేటు డ్రైవర్ ను అక్కడున్న ఒక పోలీసు అధికారి కొట్టారు. దీంతో బాధిత ప్రైవేటు డ్రైవర్ కు అండగా అద్దె బస్సుల డ్రైవర్లు పోలీసుల తీరును నిరసిస్తూ మంచిర్యాల బస్ డిపో వద్ద ఆందోళన చేపట్టారు.
