ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం కార్మికులను సమ్మె విరమించాలని కోరింది. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించింది.సమ్మె సమస్యలకు పరిష్కారం కాదని ప్రభుత్వం పేర్కొంటూ, చర్చల ద్వారానే అన్ని అంశాలను పరిష్కరించవచ్చని తెలిపింది. కార్మికుల సమస్యలను పరిశీలించేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది.కార్మికులు పెట్టిన డిమాండ్లలో చాలా వరకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని, కొన్ని కీలక అంశాలపై మరింత చర్చ అవసరమని పేర్కొంది. ముఖ్యంగా ఆర్టీసీ విలీనం, సంఘాల ఎన్నికల విషయాల్లో నిర్ణయం తీసుకోవడానికి సమయం కావాలని తెలిపింది.సమ్మె కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజా రవాణా తీవ్రంగా దెబ్బతింది. ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సమ్మెను విరమించాలని ప్రభుత్వం మరోసారి విజ్ఞప్తి చేసింది.
