Breaking News

హెడ్‌లైన్: మీర్జాపూర్‌లో భయంకర రోడ్డు ప్రమాదం – 11 మంది సజీవదహనం

ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక) : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మిర్జాపూర్ జిల్లాలో విషాదకర రోడ్డు ప్రమాదం జరిగింది. కంకర లోడుతో వేగంగా వెళ్తున్న ఒక భారీ ట్రక్కు అదుపు తప్పి ముందున్న కారును బలంగా ఢీకొట్టింది. ఆ ఢీకొనడంతో కారు పక్కనే ఉన్న మరో బొలేరో వాహనాన్ని ఢీకొనగా, వెంటనే భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బొలేరో వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. అందులో ప్రయాణిస్తున్న 11 మంది బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ట్రక్కు బ్రేకులు ఫెయిల్ కావడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో గుర్తింపు ప్రక్రియ క్లిష్టంగా మారింది.

తెలంగాణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం: ప్రధాని మోదీ

ఒమన్ ఒప్పందంతో ఇంధన సరఫరాకు భరోసా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *