Breaking News

తమిళనాడులో ఉత్సాహంగా పోలింగ్.. ప్రముఖుల ఓటింగ్

ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం ప్రారంభమై రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు భారీగా తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. భద్రతా దృష్ట్యా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.సినీ, రాజకీయ ప్రముఖులు కూడా పోలింగ్‌లో పాల్గొనడం విశేషంగా నిలిచింది. నటులు విజయ్, రజినీకాంత్, అజిత్, దర్శకుడు అట్లీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజలతో కలిసి ప్రముఖులు కూడా క్యూ లైన్లలో నిలబడి ఓటింగ్ చేయడం ఆకర్షణగా మారింది.రాష్ట్రంలోని 234 నియోజకవర్గాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో 4,023 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రముఖ నటుడు విజయ్ ఎన్నికల బరిలో ఉండటంతో ఈసారి రాజకీయ పోరు మరింత ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది.

రైతుల జీవితాలపై ‘ఫీచర్ ఫిల్మ్’ ప్రారంభం

సినీ విశ్లేషకుడు త్రిపురనేని చిట్టిబాబు మృతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *