ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేయడంతో రాజకీయాల్లో చర్చ నెలకొంది. ఈ అంశంపై బీజేపీ నేత రాంచందర్ రావు స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు.ఖర్గే వ్యాఖ్యలు బాధ్యతారహితంగా ఉన్నాయని, అవి పార్టీ పరిస్థితిని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. ఆయన స్వతంత్రంగా మాట్లాడటం లేదని, ఇతర నాయకుల ప్రభావంలోనే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, ఎన్నికల సమయంలో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ప్రజలు ఈసారి సరైన నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.ఎన్నికల సమయంలో ఓటర్లు భయపడకుండా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో ఓటు విలువ ఎంతో గొప్పదని, దాని ద్వారా దేశ భవిష్యత్తు నిర్ణయించబడుతుందని పేర్కొన్నారు.రాబోయే ఫలితాల్లో ప్రజల మద్దతు స్పష్టంగా బయటపడుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
