విజయవాడ. ఏప్రిల్ 23 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం కపుగున్నేరి గ్రామంలో విష్ణు వెహికల్ వెల్నెస్ టెస్టింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆటో మేటెడ్ టెస్టింగ్ స్టేషన్ (వాహన ఫిట్నెస్ సెంటర్) ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్ర సాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేంద్రాన్ని ప్రారంభించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వాహనాల ఫిట్ నెస్ పరీక్షలు నిర్వహించడం రోడ్డు భద్రతకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడం లో ఇలాంటి సదుపాయా లు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, సంస్థ ప్రతినిధులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

