ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): కోర్టు విచారణ వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్న వ్యవహారంపై ఢిల్లీ హైకోర్టు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు నోటీసులు జారీ చేసింది.విచారణకు సంబంధించిన వీడియోలను అనుమతి లేకుండా ప్రచారం చేయడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఆ వీడియోలను అన్ని సోషల్ మీడియా వేదికల నుంచి తొలగించాలని ఆదేశించింది.న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్పై స్పందించిన హైకోర్టు, ఈ చర్యలు కోర్టు నిబంధనలకు విరుద్ధమా అనే అంశంపై విచారణ చేపట్టింది. కేజ్రీవాల్తో పాటు సంబంధిత సంస్థలు పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశించింది.ఈ ఘటన న్యాయవ్యవస్థ గౌరవానికి భంగం కలిగించేలా ఉందని పిటిషనర్ వాదించగా, కోర్టు దీనిని సీరియస్గా తీసుకుని తదుపరి చర్యలు ప్రారంభించింది.
