Breaking News

నాదెండ్ల మనోహర్‌ను ఫోన్‌లో పరామర్శించిన పవన్ కళ్యాణ్

అమరావతి, ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు మరణంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుమారుడు మంత్రి నాదెండ్ల మనోహర్‌ను ఫోన్‌లో పరామర్శించి కుటుంబానికి ధైర్యం చెప్పారు.అనారోగ్య కారణాల వల్ల అంత్యక్రియలకు హాజరు కాలేకపోతున్నానని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ విషాదం నుంచి త్వరగా కోలుకోవాలని మనోహర్‌కు ఆకాంక్షించారు.1935 జూన్ 23న గుంటూరులో జన్మించిన నాదెండ్ల భాస్కరరావు న్యాయవాదిగా తన కెరీర్ ప్రారంభించి, తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1978లో ఎమ్మెల్యేగా ఎన్నికై, అనంతరం చెన్నారెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు.తరువాత కాంగ్రెస్ పార్టీని వీడి, ఎన్టీఆర్‌తో కలిసి తెలుగుదేశం పార్టీ స్థాపనలో కీలక పాత్ర పోషించారు. ఆయన రాజకీయ వారసత్వాన్ని ప్రస్తుతం నాదెండ్ల మనోహర్ కొనసాగిస్తున్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *