ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): పశ్చిమ బెంగాల్లో తొలి విడత పోలింగ్ నేపథ్యంలో కృష్ణానగర్లో నిర్వహించిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.మే 4న ఫలితాలు వచ్చిన తర్వాత బెంగాల్లో స్వీట్లు, ఝాల్ మురీ పంచుతామని అన్నారు. ఇటీవల తాను ఝాల్ మురీ తిన్నానని, కానీ ఆ ఘాటు టీఎంసీకి తగిలిందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.రాష్ట్రంలో మార్పు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని, ఈ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు పెరిగిందని మోదీ తెలిపారు.
