Breaking News

నర్సంపేటలో ఆర్టీసీ నిరసన ఉద్రిక్తం.. డ్రైవర్ ఆత్మహత్యాయత్నం కలకలం

ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల ఆందోళనలు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ రెండో రోజు కూడా రాష్ట్రవ్యాప్తంగా డిపోల ముందు ధర్నాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనలో పాల్గొంటున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ పెట్రోల్ పోసుకుని తనపై నిప్పంటించుకోవడంతో కలకలం రేగింది. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో, సహచర కార్మికులు వెంటనే ఆయనను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.గత రెండు రోజులుగా సమ్మెలో పాల్గొంటున్న శంకర్‌గౌడ్ ఈ చర్యకు పాల్పడడం ఆందోళనకారుల్లో ఆగ్రహం, ఆందోళనను మరింత పెంచింది. ఘటనపై స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

మహిళా రిజర్వేషన్‌పై ‘మహిళా ఆగ్రహ యాత్ర’.. వినాయకనగర్‌లో బీజేపీ నిరసన

బడంగ్‌పేట్ కార్పొరేషన్‌లో అవినీతి ఆరోపణలు.. సీఎం రేవంత్ రెడ్డికి సబితా ఇంద్రారెడ్డి లేఖ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *