ఏప్రిల్ 23, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్లో బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినీతి వ్యవహారంపై మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. కార్పొరేషన్లో అభివృద్ధి పనులు, నిధుల వినియోగంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రజా ధనం దుర్వినియోగం అయ్యే పరిస్థితులను అరికట్టాల్సిన అవసరం ఉందని లేఖలో పేర్కొన్నారు.ఈ ఆరోపణలపై ప్రభుత్వం వెంటనే స్పందించి నిజానిజాలు బయటపెట్టాలని, పారదర్శక విచారణ ద్వారా బాధ్యులను గుర్తించాలని సబితా ఇంద్రారెడ్డి కోరారు.
