Breaking News

అమరావతి నిర్మాణం వేగవంతం.. వినియోగానికి సిద్ధమైన ప్రజాప్రతినిధుల నివాసాలు

ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు మళ్లీ ఊపందుకుని శరవేగంగా కొనసాగుతున్నాయి. గతంలో నిలిచిపోయిన ప్రాజెక్టులు తిరిగి ప్రారంభమై, ఇప్పుడు వేగంగా పూర్తి దశకు చేరుకుంటున్నాయి. ముఖ్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం నిర్మిస్తున్న విల్లాలు తుది దశకు చేరుకొని త్వరలో వినియోగానికి సిద్ధమవుతున్నాయి.ఆధునిక సౌకర్యాలతో, ఆకర్షణీయమైన డిజైన్లతో ఈ నివాస సముదాయాలు రూపుదిద్దుకుంటున్నాయి. పరిపాలనా యంత్రాంగాన్ని రాజధానిలోనే కేంద్రీకరించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం నిర్మాణాలను వేగవంతం చేస్తోంది. సీఎం చంద్రబాబు మార్గదర్శకత్వంలో అమరావతిని పూర్తి స్థాయి పరిపాలనా కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా పనులు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి.ఇక కీలక ప్రభుత్వ భవనాల నిర్మాణం కూడా సమాంతరంగా కొనసాగుతోంది. ముఖ్యంగా హైకోర్టు భవనం నిర్మాణం వేగంగా ముందుకు సాగుతోంది. సుమారు 24 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో, ఎనిమిది అంతస్తులతో నిర్మితమవుతున్న ఈ భవనం ఆధునిక న్యాయ వ్యవస్థకు ప్రతీకగా నిలవనుంది.అలాగే ఐకానిక్ టవర్స్ నిర్మాణ పనులు కూడా పురోగమిస్తున్నాయి. భవిష్యత్తులో అమరావతి నగర రూపురేఖలను మార్చే విధంగా ఈ టవర్స్ నిలుస్తాయని అధికారులు భావిస్తున్నారు. అసెంబ్లీ భవనం నిర్మాణం కూడా ప్రాధాన్యతతో కొనసాగుతోంది.రాజధాని ప్రాంతం అంతటా వేలాది మంది కార్మికులు నిరంతరం శ్రమిస్తూ నిర్మాణాలను వేగవంతం చేస్తున్నారు. రహదారులు, డ్రైనేజీ, తాగునీటి పైప్‌లైన్‌ల వంటి మౌలిక సదుపాయాల పనులు కూడా పలు కిలోమీటర్ల మేర పూర్తయ్యాయి.అమరావతిని ఆధునిక, సుస్థిర నగరంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలు అమలు చేస్తోంది. 2029 నాటికి పూర్తి స్థాయి రాజధానిని సిద్ధం చేయాలన్న లక్ష్యంతో నిర్మాణ పనులు దూసుకుపోతున్నాయి. మొత్తంగా అమరావతి మరోసారి నిర్మాణ హోరుతో రాష్ట్ర భవిష్యత్తు కేంద్రంగా అవతరించనుంది.

10 రోజుల్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చకు సిద్ధం: చంద్రబాబు

వైసీపీపై మంత్రి సంధ్యారాణి ఫైర్.. “ప్రభుత్వానికి వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *