Breaking News

సింగపూర్‌లో ఏపీ మంత్రుల శిక్షణ.. ‘వీ ఫస్ట్’ మోడల్‌పై అధ్యయనం

ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం సింగపూర్‌లో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమం నాలుగో రోజుకు చేరుకుంది. ఆధునిక పాలనలో సింగపూర్ అనుసరిస్తున్న అభివృద్ధి, పారిశ్రామిక, సాంకేతిక మరియు పర్యావరణ విధానాలపై మంత్రులు సమగ్రంగా అవగాహన పొందుతున్నారు.ఈ సందర్భంగా సింగపూర్ ప్రభుత్వ విధానాలు, పరిపాలనా నమూనాలపై మాజీ మంత్రి లిమ్ స్వీ సే వివరించారు. ‘నేషన్ ఫస్ట్’ నుంచి ‘వీ ఫస్ట్’ దిశగా మార్పు, ప్రజలు–ప్రభుత్వం–ప్రైవేట్ రంగాల సమన్వయం, దీర్ఘకాలిక ప్రణాళికలు, పారదర్శకత ద్వారా విశ్వాసం సాధించడం వంటి అంశాలపై చర్చలు జరిగాయి.అలాగే నియోజకవర్గ స్థాయిలో ప్రజల ఫిర్యాదుల పరిష్కారం, సమస్యలను వేగంగా గుర్తించి పరిష్కరించే వ్యవస్థల బలోపేతంపై కూడా మంత్రులు అధ్యయనం చేస్తున్నారు. సింగపూర్ మోడల్‌ను రాష్ట్రంలో అమలు చేసే అవకాశాలపై చర్చలు కొనసాగుతున్నాయి.ఈ శిక్షణలో మంత్రులు అచ్చెన్నాయుడు, బి.సి. జనార్దన్ రెడ్డి, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే విధానాలను స్వీకరించే దిశగా ఈ పర్యటన కీలకంగా మారనుంది.

భగీరథ్‌కు ప్రత్యేక సౌకర్యాలు లేవు

పోక్సో కేసులో హైకోర్టును ఆశ్రయించిన బండి భగీరథ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *