ఏప్రిల్ 24, (నేటి తెలుగు పత్రిక): నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య ఘటనపై కేంద్ర సహాయ మంత్రి త్మహత్యలు చేయొద్దు.. కార్మికులకు బండి సంజయ్ విజ్ఞప్తి తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న నేపథ్యంలో కార్మికులకు కీలక సూచనలు చేశారు.కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ ఘటనను “ప్రభుత్వ హత్య”గా అభివర్ణిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సిన బదులు కమిటీలు వేసి కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలునే కోరుతున్నారని ఆయన అన్నారు. ముఖ్యంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న వాగ్దానం అమలు కాకపోవడం వల్లే కార్మికుల్లో అసంతృప్తి పెరిగిందని పేర్కొన్నారు.గత ప్రభుత్వాలపై కూడా విమర్శలు చేసిన బండి సంజయ్, కార్మికుల సమస్యలు ఏ ప్రభుత్వంలోనూ పూర్తిగా పరిష్కారం కాలేదని వ్యాఖ్యానించారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు న్యాయసమ్మతమైనవేనని, ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో కార్మికులకు ఆయన భావోద్వేగపూర్వక విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఆత్మహత్యలు వంటి తీవ్ర చర్యలకు పాల్పడవద్దని కోరారు. “మీ ప్రాణాలు అమూల్యమైనవి.. కుటుంబాలను గుర్తుంచుకుని సహనం పాటించండి” అని సూచించారు.అలాగే ఆర్టీసీ విలీనం, పీఆర్సీ బకాయిల చెల్లింపు, యూనియన్ పునరుద్ధరణ వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
