Breaking News

జులైలో కొత్త పార్టీ.. రీఎంట్రీపై విజయసాయి రెడ్డి

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త చర్చ మొదలైంది. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి త్వరలోనే రాజకీయాల్లోకి మళ్లీ అడుగుపెట్టనున్నట్లు తెలిపారు. జులై నెలలో కొత్త పార్టీని ప్రకటిస్తానని స్పష్టం చేశారు.రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీ అవసరం ఉందని పేర్కొన్న ఆయన, ఎన్నికల్లో ఓడిన వైసీపీ ఇప్పటికైనా తన విధానాలను పునఃపరిశీలించుకోవాలని సూచించారు. ప్రజలకు ప్రత్యామ్నాయంగా నిలిచే రాజకీయ వేదికను తీసుకురావాలన్నదే తన లక్ష్యమని తెలిపారుఇక మద్యం కేసుకు సంబంధించి హైదరాబాద్‌లోని తన నివాసంలో ఈడీ అధికారులు నిర్వహించిన సోదాలపై కూడా ఆయన స్పందించారు. తన ఇంట్లో జరిగిన తనిఖీల్లో ఎలాంటి అక్రమాలు బయటపడలేదని పేర్కొన్నారు. విచారణ జరపాల్సింది తనపై కాకుండా సీఎం నారా చంద్రబాబు నాయుడుపై జరపాలని వ్యాఖ్యానించారు.ఈ ప్రకటనతో ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఎలా మారుతాయన్నది ఆసక్తికరంగా మారింది.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *