Breaking News

కేటీఆర్‌పై కవిత ఘాటు వ్యాఖ్యలు.. తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం ముదురు

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో వేడెక్కిన పరిస్థితుల్లో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ రాజకీయ పరిపక్వత కోల్పోయిందని, కేటీఆర్‌కు రాజకీయ అవగాహన తక్కువగా ఉందని ఆమె విమర్శించారు.మునీరాబాద్‌లో నిర్వహించిన సభలో తన కొత్త పార్టీ “తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్‌ఎస్)”ను ప్రకటించిన కవిత, రాష్ట్రంలో బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా తమ పార్టీ పోటీకి సిద్ధమైందని తెలిపారు.కవిత చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కేటీఆర్‌పై చేసిన వ్యక్తిగత విమర్శలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.ఈ పరిణామాలతో తెలంగాణలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త పార్టీ ప్రవేశంతో రాష్ట్ర రాజకీయ సమీకరణాలు మారే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *