Breaking News

గవర్నర్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): విజయవాడలో లోక్ భవన్‌ను సందర్శించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురై ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన గవర్నర్‌ను పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.ఈ సందర్భంగా గవర్నర్ త్వరగా పూర్తిగా కోలుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. గవర్నర్ ఆరోగ్యం మెరుగుపడుతున్నట్లు తెలుస్తుండగా, ఆయనతో జరిగిన ఈ భేటీ సౌహార్ద వాతావరణంలో కొనసాగింది.రాష్ట్రంలో జరుగుతున్న పలు అంశాలపై కూడా ఈ సందర్భంగా పరస్పరంగా చర్చించినట్లు సమాచారం.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *