Breaking News

తెలంగాణలో ఎమ్మెల్సీ నియామకాలకు గ్రీన్ సిగ్నల్.. అజారుద్దీన్, కోదండరాం ఎంపికకు ఆమోదం

ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో ఇద్దరు ఎమ్మెల్సీల నియామకానికి గవర్నర్ ఆమోదం లభించింది. మహ్మద్ అజారుద్దీన్, ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ఆమోదం తెలిపారు. ఈ మేరకు సంబంధిత ఫైల్‌పై ఆయన సంతకం చేశారు.ప్రస్తుతం మంత్రి పదవిలో ఉన్న అజారుద్దీన్‌కు ఈ నెల 30 నాటికి ఆరు నెలల గడువు పూర్తికానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం, మంత్రి పదవిలో కొనసాగాలంటే ఆరు నెలల్లో శాసనసభ లేదా శాసనమండలిలో సభ్యత్వం పొందాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీగా ఆయన నియామకం దాదాపు ఖరారైనట్లైంది.ఇక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కోదండరాం ఎంపిక కూడా రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఆయనను మండలిలోకి తీసుకోవడం ద్వారా ప్రభుత్వం సామాజిక, రాజకీయ సమతుల్యతను సాధించే ప్రయత్నంగా విశ్లేషకులు భావిస్తున్నారు. గవర్నర్ ఆమోదంతో ఈ నియామక ప్రక్రియ వేగం అందుకోనుంది. త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉండగా, అనంతరం ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం జరగనుంది. దీంతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశముంది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *