Breaking News

ఎంపీ వద్దిరాజు మున్నూరుకాపు సంఘం ఖమ్మం జిల్లా బాధ్యత స్వీకరించిన: ఆవుల రామారావు

కోదాడ: ఏప్రిల్25( నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన,మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆవుల రామారావు ఖమ్మం జిల్లా బాధ్యులుగా నియమితులయ్యారు.ఇందుకు సంబంధించిన నియామక పత్రాన్ని సంఘం గౌరవాధ్యక్షులు, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర నుంచి శనివారం స్వీకరించారు.ఖమ్మం జిల్లాలో మున్నూరుకాపులందరిని మరింత సమన్వయం చేస్తూ,వారి సంక్షేమానికి,ఉన్నతికి,సంఘం బలోపేతానికి కృషి చేయాల్సిందిగా కోరుతూ ఎంపీ రవిచంద్ర ఆయనకు పలు సూచనలు చేశారు,సలహాలిచ్చారు.ఈ సందర్భంగా మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు సర్థార్ పుటం పురుషోత్తమ రావు, ప్రముఖులు రౌతు కనకయ్య, రమేష్ హజారీ,మరికల్ పోత సుధీర్ కుమార్,ఊసా రఘు,పలుగుల శ్రీనివాస్,సిలిగిరి విక్రమ్ తదితరులు ఉన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *