Breaking News

బీసీల అభ్యున్నతే సీఎం చంద్రబాబు లక్ష్యం: మంత్రి సవిత

అమరావతి, ఏప్రిల్ 26, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో బీసీల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని మంత్రి ఎస్. సవిత స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటున్నారని, వారి అభ్యున్నతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.తాడేపల్లిలో జరిగిన సమావేశంలో మాట్లాడిన మంత్రి సవిత, బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టానికి తుది రూపు ఇస్తున్నామని వెల్లడించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.టీడీపీ స్థాపకుడు నందమూరి తారకరామారావు ఆశయాలను కొనసాగిస్తూ సీఎం చంద్రబాబు పాలన సాగిస్తున్నారని, బీసీలకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ప్రాధాన్యం కల్పిస్తున్నారని చెప్పారు. బీసీల సాధికారత కోసం ప్రత్యేక సమితులను ఏర్పాటు చేసి, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటున్నామని పేర్కొన్నారు.గత ప్రభుత్వ పాలనలో బీసీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వారి హక్కులు హరించబడ్డాయని మంత్రి విమర్శించారు. బీసీ సబ్ ప్లాన్ నిధుల మళ్లింపు, రిజర్వేషన్ల తగ్గింపు వంటి చర్యలు బీసీలకు నష్టం కలిగించాయని ఆరోపించారు.ప్రస్తుతం ప్రభుత్వం ‘ఆదరణ’ వంటి పథకాల ద్వారా బీసీ వృత్తులకు పునరుజ్జీవం కల్పించేందుకు కృషి చేస్తోందని తెలిపారు. రాబోయే కాలంలో బీసీలకు మరింత ప్రోత్సాహం అందించే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మంత్రి సవిత స్పష్టం చేశారు.

డిజిటల్ సేవల్లో దూసుకెళ్తున్న ఏపీఎస్‌ఆర్టీసీకి మరో జాతీయ అవార్డు

రైతు సంక్షోభానికి వైసీపీ పాలన కారణం: మంత్రి అచ్చానాయుడు విమర్శలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *