ఏప్రిల్ 26, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్లోని గాంధీ భవన్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ను ప్రోటోకాల్ & కోఆర్డినేషన్ కమిటీ నూతన సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. తాజాగా నియమితులైన కమిటీ సభ్యులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ హెచ్. వేణుగోపాల్ రావు, వైస్ చైర్మన్ కిషోర్ రెడ్డి, కన్వీనర్ ఎం.ఏ. ఫహీం కలిసి టీపీసీసీ చీఫ్ను అభినందించారు. కమిటీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు తమ పూర్తి సహకారం అందిస్తామని వారు తెలిపారు. అలాగే సభ్యులుగా నియమితులైన ఎన్. భాను ప్రకాశ్ రెడ్డి, కె.వి. ప్రసాద్, సురాజ్ తివారి, సుదిని మహేందర్, అల్లం రాకేష్ తదితరులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ కార్యక్రమాల సమన్వయం, ప్రోటోకాల్ వ్యవహారాల నిర్వహణలో కమిటీ కీలక పాత్ర పోషించనుందని నేతలు పేర్కొన్నారు.

