ఏప్రిల్ 26, (నేటి తెలుగు పత్రిక): టాలీవుడ్ యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలో పెళ్లి పీటలెక్కనున్న నేపథ్యంలో ఆయన కుటుంబంలో సంబరాలు మొదలయ్యాయి. వివాహ ఏర్పాట్లు వేగంగా కొనసాగుతుండగా, ప్రముఖులను ఆహ్వానించే కార్యక్రమాన్ని బెల్లంకొండ కుటుంబం కొనసాగిస్తోంది.ఈ క్రమంలో సాయి శ్రీనివాస్ తన తండ్రి బెల్లంకొండ సురేష్ తో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ను మర్యాదపూర్వకంగా కలుసుకుని వివాహానికి ఆహ్వానించారు. అలాగే ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ను కూడా ప్రత్యేకంగా కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.సాయి శ్రీనివాస్ వివాహం కావ్యారెడ్డి అనే యువతితో జరగనుంది. ఏప్రిల్ 29న తిరుమల లో ఈ వివాహ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.ఇప్పటికే ఈ జంట నిశ్చితార్థం హైదరాబాద్లో సాదాసీదాగా జరిగింది. అయితే వివాహాన్ని వైభవంగా నిర్వహించేందుకు బెల్లంకొండ కుటుంబం సిద్ధమవుతోంది. ఈ వేడుక టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారగా, పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం.
