ఏప్రిల్ 26, (నేటి తెలుగు పత్రిక): అమెరికాలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న కార్యక్రమం సమీపంలో జరిగిన కాల్పుల ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ ప్రజాస్వామ్యంలో హింసకు ఎలాంటి స్థానం లేదని స్పష్టం చేశారు. ట్రంప్, ఆయన సతీమణి మెలానియా ట్రంప్ సురక్షితంగా ఉన్నారన్న సమాచారం తనకు ఉపశమనం కలిగించిందని తెలిపారు.వాషింగ్టన్ డీసీలోని వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో జరిగిన వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. కార్యక్రమం జరుగుతున్న సమయంలో హోటల్ వెలుపల కాల్పుల శబ్దాలు వినిపించడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై ట్రంప్ దంపతులతో పాటు ఇతర ప్రముఖులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సీక్రెట్ సర్వీస్ సిబ్బంది వేగంగా స్పందించడంతో ఎలాంటి ప్రమాదం జరగకుండా నివారించగలిగారు.ఈ ఘటన నేపథ్యంలో కార్యక్రమాన్ని తక్షణమే నిలిపివేసి, పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. కాల్పులపై అమెరికా భద్రతా సంస్థలు దర్యాప్తు కొనసాగిస్తున్నాయి.ఈ ఘటనపై స్పందించిన ప్రధాని మోదీ, ట్రంప్ కుటుంబం సురక్షితంగా ఉండటం సంతోషకరమని, ప్రజాస్వామ్యంలో హింసకు చోటు లేదని పేర్కొన్నారు.
