Breaking News

ఆర్థిక సంస్కరణలతో దేశ దిశ మారింది: సీఎం చంద్రబాబు

ఏప్రిల్ 26, (నేటి తెలుగు పత్రిక): ముంబైలో జరిగిన ఎకనామిక్ టైమ్స్ ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ ఆర్థికాభివృద్ధి, సంస్కరణలపై ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు.ఆర్థిక సంస్కరణలు అమలులోకి వచ్చిన సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. సంస్కరణల ముందు, తర్వాత దేశ ఆర్థిక పరిస్థితుల్లో వచ్చిన మార్పులను దగ్గరగా పరిశీలించినట్లు చెప్పారు.1990లలో ప్రారంభమైన ఆర్థిక సంస్కరణలు దేశాన్ని గ్లోబల్ స్థాయిలో ముందుకు నడిపించాయని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో రాష్ట్ర అభివృద్ధికి విజన్ ఆధారిత ప్రణాళికలు రూపొందించామని, “విజన్ 2020” ద్వారా అభివృద్ధికి బలమైన పునాది వేశామని గుర్తుచేశారు.ఐటీ రంగంపై దృష్టి పెట్టడం వల్ల హైదరాబాద్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ కేంద్రంగా ఎదిగిందని తెలిపారు. ప్రస్తుతం కనిపిస్తున్న మౌలిక వసతులు, ఐటీ విస్తరణ అన్నీ ఆ దిశలో తీసుకున్న నిర్ణయాల ఫలితమని అన్నారు.దేశం ఇప్పుడు మరో కీలక దశలో ఉందని, ఆధునిక సాంకేతిక రంగాలైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం కంప్యూటింగ్ వంటి వాటిని సమర్థంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. భవిష్యత్ అభివృద్ధికి టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.యువతకు నైపుణ్యాభివృద్ధి ఎంతో ముఖ్యమని, గ్లోబల్ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, కాలానుగుణ మార్పులను స్వీకరించాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు సూచించారు.

ప్రత్యేక అసెంబ్లీ అవసరమా? సీపీఐ నేత రామకృష్ణ ప్రశ్న

ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్ష

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *