విజయవాడ. ఏప్రిల్ 27 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: రాష్ట్రంలో ఎక్కడా ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అన్ని రవాణా సంస్థలు తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశా ఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన పెట్రోల్, డీజిల్ సరఫరా లో తాత్కాలిక అంతరా యాలు ఉన్నప్పటికీ, ప్రయాణికుల సేవల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యామ్నా య ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రజల అవ సరాలను దృష్టిలో ఉంచు కుని బస్సులు, ఇతర రవాణా సేవలు నిరంత రంగా కొనసాగించాలని, రవాణా సంస్థలు, ప్రైవేట్ ఆపరేటర్లు సమన్వయం తో పనిచేయాలని తెలిపా రు. ఎక్కడైనా నిర్లక్ష్యం వల్ల ప్రయాణికులకు అసౌ కర్యం కలిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు కూడా ఆందోళన చెంద కుండా సహకరించాలని మంత్రి మండిపల్లి రాంప్ర సాద్ రెడ్డి కోరారు.
