ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి అజారుద్దీన్, ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి వారికి ప్రమాణం చేయించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సహా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరై నూతన సభ్యులకు అభినందనలు తెలిపారు. రాజకీయ, సామాజిక రంగాల్లో విశేష అనుభవం కలిగిన ఈ ఇద్దరు సభ్యులు శాసనమండలిలో ప్రజల సమస్యలను సమర్థవంతంగా ప్రతినిధ్యం వహిస్తారని ఆశాభావం వ్యక్తమైంది.
