Breaking News

ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాం ప్రమాణ స్వీకారం.. కార్యక్రమానికి సీఎం రేవంత్ హాజరు

ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, ప్రొఫెసర్ కోదండరాం శాసనమండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ అయిన వీరితో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తన చాంబర్‌లో ప్రమాణం చేయించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హాజరై నూతన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.అదేవిధంగా మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, డాక్టర్ వివేక్ వెంకటస్వామి, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కార్యక్రమంలో పాల్గొన్నారు.రాజకీయ, సామాజిక రంగాల్లో అనుభవం కలిగిన ఈ ఇద్దరు నాయకులు శాసనమండలిలో ప్రజల సమస్యలను సమర్థవంతంగా ప్రస్తావిస్తారని ఆశాభావం వ్యక్తమవుతోంది.

అసెంబ్లీ ప్రాంగణం పార్లమెంట్‌ తరహాలో ఉండాలి: సీఎం రేవంత్‌రెడ్డి

కవితపై తీన్మార్ మల్లన్న సవాల్.. రాజకీయాల్లో వేడెక్కిన వివాదం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *