ఏప్రిల్ 27, (నేటి తెలుగు పత్రిక): పశ్చిమ బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ గెలుపుపై పూర్తి నమ్మకం వ్యక్తం చేశారు. ప్రచారానికి ముగింపు పలికిన సందర్భంగా జరిగిన సభలో మాట్లాడిన ఆయన, ప్రజల స్పందన చూస్తే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.బ్యారక్పూర్లో నిర్వహించిన భారీ సభలో మోదీ మాట్లాడుతూ, మే 4న ఫలితాలు వెలువడిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విజయోత్సవాలు జరుపుకుంటామని తెలిపారు. మళ్లీ బెంగాల్కు వచ్చే సారి బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికే వస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు.ప్రచారంలో ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించిందని పేర్కొంటూ, హెలిప్యాడ్ నుంచి సభా వేదిక వరకూ ప్రజలు భారీగా తరలి వచ్చి స్వాగతం పలికారని తెలిపారు. ప్రజల ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు.తాను సాధారణ కార్యకర్తగా పార్టీ ఇచ్చిన ప్రతి బాధ్యతను నిర్వర్తించానని, దేశ ప్రజలే తన కుటుంబమని మోదీ అన్నారు. ప్రజల ఆశయాల సాధనకే తన రాజకీయ ప్రయాణమని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా అధికార తృణమూల్ కాంగ్రెస్పై విమర్శలు గుప్పించిన ప్రధాని, ఒకప్పుడు ప్రజల నమ్మకంతో వచ్చిన ఆ పార్టీ తన సిద్ధాంతాలను విస్మరించిందని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం మార్పు అవసరమని, బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.
